Last Updated on 30.07.2026 by Krithik C
మహిళలకు భారీ గుడ్ న్యూస్..80 శాతం సబ్సిడీతో ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ | Electric Scooter Subsidy Scheme 2026
Govt Scheme కింద 80 శాతం సబ్సిడీతో ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీకి లబ్ధిదారుల ఎంపిక వేగవంతమైంది. ఆగస్టు 20లోపు తుది జాబితా ఖరారు కానుంది.
తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న 80 శాతం సబ్సిడీ ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ కోసం దరఖాస్తుల పరిశీలన వేగవంతమైంది. ఈ Govt Scheme ద్వారా హైదరాబాద్ జిల్లాలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
ఈ ప్రతిష్టాత్మక పథకం కింద ఒక్కో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.50 లక్షలు కాగా, ప్రభుత్వం 80 శాతం అనగా రూ. 1.20 లక్షలు సబ్సిడీగా భరిస్తుంది. ఎంపికైన లబ్ధిదారుడు కేవలం 20 శాతం అంటే రూ. 30,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
| పథకం వివరాలు | ముఖ్యాంశాలు |
| Govt Scheme | 80% సబ్సిడీ ఎలక్ట్రిక్ స్కూటర్లు |
| లక్ష్యం | 1,200 స్కూటర్లు |
| అందిన దరఖాస్తులు | 28,045 |
| లబ్ధిదారుడి వాటా | రూ. 30,000 (20%) |
మండల స్థాయి మరియు జిల్లా స్థాయి కమిటీల ద్వారా దరఖాస్తులను పరిశీలించి పూర్తి పారదర్శకతతో జాబితా తయారు చేస్తున్నారు. ఆగస్టు 20లోపు తుది ఎంపిక పూర్తి చేసి అర్హులైన వారికి ఈ Govt Scheme ప్రయోజనాలు అందించనున్నారు.
👉 National Family Benefit Scheme కింద సత్వర సాయం.. ఇంటి పెద్దను కోల్పోతే రూ.20 వేల ఆర్థిక సహాయం
👉 PM-KUSUM: రైతులకు సోలార్ పంపులపై భారీ సబ్సిడీ.. దరఖాస్తు విధానం ఇదే!
Tags: Govt Scheme 2026, electric scooter subsidy, minority finance corporation, hyderabad collector, 80 percent subsidy, free scooty scheme, telangana schemes, women empowerment schemes, subsidized electric scooters, minorites welfare scheme, govt scheme apply online, rta driving license check, hyderabad news, latest govt schemes, self employment scheme, scooty subsidy telangana, welfare programs india
